ఆసియా కమ్యూనిటీ ప్రతినిధుల కోసం 'ఎంఓఐ' సెమినార్
- January 04, 2019దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దేశంలోని ఏషియన్ కమ్యూనిటీస్ ప్రతినిధుల కోసం అవేర్నెస్ సెమినార్ ఏర్పాటు చేసింది. మినిస్ట్రీకి సంబంధించిన పలు డిపార్ట్మెంట్స్ ఈ సెమినార్లో పాల్గొన్నాయి. యూనిఫైడ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అందిస్తున్న, ప్రవేశపెడుతున్న సర్వీసులు సహా పలు అంశాలపై ఈ సెమినార్లో చర్చ జరిగింది. డ్రగ్స్ వాడకంతో తలెత్తే సమస్యలు, రోడ్ మరియు పబ్లిక్ సేఫ్టీ, అగ్ని ప్రమాదాలు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. యూనిఫైడ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఈ సెమినార్లో పలు మిషన్స్కి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇచ్చింది. దేశంలోని తమకు చెందిన 16 కేంద్రాల ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన సేవలు అందిస్తున్నట్లుగా తెలిపింది. పాదచారుల భద్రత వాహనాలు నడిపే సమయంలో భద్రత వంటి అంశాలపైనా, అలాగే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ నిబంధనలు చర్చకు వచ్చాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అగ్ని ప్రమాదాలపై ప్రజెంటేషన్ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!