ఆసియా కమ్యూనిటీ ప్రతినిధుల కోసం 'ఎంఓఐ' సెమినార్
- January 04, 2019
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దేశంలోని ఏషియన్ కమ్యూనిటీస్ ప్రతినిధుల కోసం అవేర్నెస్ సెమినార్ ఏర్పాటు చేసింది. మినిస్ట్రీకి సంబంధించిన పలు డిపార్ట్మెంట్స్ ఈ సెమినార్లో పాల్గొన్నాయి. యూనిఫైడ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అందిస్తున్న, ప్రవేశపెడుతున్న సర్వీసులు సహా పలు అంశాలపై ఈ సెమినార్లో చర్చ జరిగింది. డ్రగ్స్ వాడకంతో తలెత్తే సమస్యలు, రోడ్ మరియు పబ్లిక్ సేఫ్టీ, అగ్ని ప్రమాదాలు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. యూనిఫైడ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఈ సెమినార్లో పలు మిషన్స్కి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇచ్చింది. దేశంలోని తమకు చెందిన 16 కేంద్రాల ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన సేవలు అందిస్తున్నట్లుగా తెలిపింది. పాదచారుల భద్రత వాహనాలు నడిపే సమయంలో భద్రత వంటి అంశాలపైనా, అలాగే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ నిబంధనలు చర్చకు వచ్చాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అగ్ని ప్రమాదాలపై ప్రజెంటేషన్ ఇచ్చింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







