ఆసియా కమ్యూనిటీ ప్రతినిధుల కోసం 'ఎంఓఐ' సెమినార్
- January 04, 2019
దోహా:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ దేశంలోని ఏషియన్ కమ్యూనిటీస్ ప్రతినిధుల కోసం అవేర్నెస్ సెమినార్ ఏర్పాటు చేసింది. మినిస్ట్రీకి సంబంధించిన పలు డిపార్ట్మెంట్స్ ఈ సెమినార్లో పాల్గొన్నాయి. యూనిఫైడ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అందిస్తున్న, ప్రవేశపెడుతున్న సర్వీసులు సహా పలు అంశాలపై ఈ సెమినార్లో చర్చ జరిగింది. డ్రగ్స్ వాడకంతో తలెత్తే సమస్యలు, రోడ్ మరియు పబ్లిక్ సేఫ్టీ, అగ్ని ప్రమాదాలు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. యూనిఫైడ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఈ సెమినార్లో పలు మిషన్స్కి సంబంధించిన ప్రెజెంటేషన్ ఇచ్చింది. దేశంలోని తమకు చెందిన 16 కేంద్రాల ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన సేవలు అందిస్తున్నట్లుగా తెలిపింది. పాదచారుల భద్రత వాహనాలు నడిపే సమయంలో భద్రత వంటి అంశాలపైనా, అలాగే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ నిబంధనలు చర్చకు వచ్చాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అగ్ని ప్రమాదాలపై ప్రజెంటేషన్ ఇచ్చింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







