ఆసియా కమ్యూనిటీ ప్రతినిధుల కోసం 'ఎంఓఐ' సెమినార్‌

- January 04, 2019 , by Maagulf
ఆసియా కమ్యూనిటీ ప్రతినిధుల కోసం 'ఎంఓఐ' సెమినార్‌

దోహా:మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ దేశంలోని ఏషియన్‌ కమ్యూనిటీస్‌ ప్రతినిధుల కోసం అవేర్‌నెస్‌ సెమినార్‌ ఏర్పాటు చేసింది. మినిస్ట్రీకి సంబంధించిన పలు డిపార్ట్‌మెంట్స్‌ ఈ సెమినార్‌లో పాల్గొన్నాయి. యూనిఫైడ్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ అందిస్తున్న, ప్రవేశపెడుతున్న సర్వీసులు సహా పలు అంశాలపై ఈ సెమినార్‌లో చర్చ జరిగింది. డ్రగ్స్‌ వాడకంతో తలెత్తే సమస్యలు, రోడ్‌ మరియు పబ్లిక్‌ సేఫ్టీ, అగ్ని ప్రమాదాలు వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. యూనిఫైడ్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌ ఈ సెమినార్‌లో పలు మిషన్స్‌కి సంబంధించిన ప్రెజెంటేషన్‌ ఇచ్చింది. దేశంలోని తమకు చెందిన 16 కేంద్రాల ద్వారా మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి సంబంధించిన సేవలు అందిస్తున్నట్లుగా తెలిపింది. పాదచారుల భద్రత వాహనాలు నడిపే సమయంలో భద్రత వంటి అంశాలపైనా, అలాగే జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌ నిబంధనలు చర్చకు వచ్చాయి. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ అగ్ని ప్రమాదాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com