బాలయ్యకు బ్రహ్మరథం పట్టిన నిమ్మకూరు వాసులు
- January 07, 2019
సొంతూరు నిమ్మకూరులో బాలకృష్ణకి ఘన స్వాగతం లభించింది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రబృందం ఇవాళ నిమ్మకూరుకి విచ్చేసింది. ఎన్టీఆర్ వేషధారణలో పంచె కట్టుతో నిమ్మకూరు వచ్చిన బాలకృష్ణకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట బయోపిక్ లో నటించిన విద్యాబాలన్, కళ్యాణ్ రామ్, డైరెక్టర్ క్రిష్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి బాలయ్య నివాళులర్పించారు.
క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వాటిలో మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' ఈ నెల 9న విడుదలకానుంది. ఎన్టీఆర్ సినిమా విడుదల కాబోతున్న 100 థియేటర్లలో ప్రజల సందర్శనార్థం 100 ఎన్టీఆర్ విగ్రహాల్ని ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఆ వంద విగ్రహాల్లో మొదటి విగ్రహాన్ని ఇవాళ తిరుతిలోని పిజెఆర్ థియేటర్లో బాలయ్య, విద్యా బాలన్ ఆవిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







