బాలయ్యకు బ్రహ్మరథం పట్టిన నిమ్మకూరు వాసులు
- January 07, 2019
సొంతూరు నిమ్మకూరులో బాలకృష్ణకి ఘన స్వాగతం లభించింది. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రబృందం ఇవాళ నిమ్మకూరుకి విచ్చేసింది. ఎన్టీఆర్ వేషధారణలో పంచె కట్టుతో నిమ్మకూరు వచ్చిన బాలకృష్ణకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట బయోపిక్ లో నటించిన విద్యాబాలన్, కళ్యాణ్ రామ్, డైరెక్టర్ క్రిష్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి బాలయ్య నివాళులర్పించారు.
క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వాటిలో మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' ఈ నెల 9న విడుదలకానుంది. ఎన్టీఆర్ సినిమా విడుదల కాబోతున్న 100 థియేటర్లలో ప్రజల సందర్శనార్థం 100 ఎన్టీఆర్ విగ్రహాల్ని ఏర్పాటు చేసింది చిత్రబృందం. ఆ వంద విగ్రహాల్లో మొదటి విగ్రహాన్ని ఇవాళ తిరుతిలోని పిజెఆర్ థియేటర్లో బాలయ్య, విద్యా బాలన్ ఆవిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







