భారత కార్మికుల్ని దుబాయ్లో కలిసిన రాహుల్ గాంధీ.!
- January 11, 2019దుబాయ్:భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రోజుల యుఎఈ పర్యటనలో భాగంగా దుబాయ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వెలుపల రాహుల్గాంధీని కలిసేందుకు పెద్ద ఎత్తున భారతదేశానికి చెందిన బ్లూ కాలర్డ్ కార్మికులు అక్కడికి చేరుకున్నారు. వారినుద్దేశించి రాహుల్గాంధీ మాట్లాడారు. మీరు ఇక్కడ ఎంతో కష్టపడుతున్నారు. స్వదేశంలో ఉన్న మీ కుటుంబ సభ్యుల కోసం మీరు పడుతున్న కష్టం నేను అర్ధం చేసుకోగలను. మీకు నేను అందించగలిగే సహాయం, అది ఎలాంటిదైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పారు రాహుల్ గాంధీ. రెండు రోజుల పర్యటనలో రాహుల్ గాంధీ దుబాయ్లో భారతదేశానికి చెందిన పలు గ్రూప్స్తో సమావేశమవుతారు. ఇదిలా ఉంటే రాహుల్ పర్యటన పట్ల దుబాయ్లో భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్పందన తాము ఊహించలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అభిప్రాయ పడ్డారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!