ఘోర రోడ్డు ప్రమాదం ఒకరి మృతి, నలుగురికి గాయాలు
- January 12, 2019యూ.ఏ.ఈ:రోడ్డు మీద వెళుతున్న వాహనం ప్రమాదానికి గురవగా, మంటలు వ్యాపించి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఎమిరేట్స్ రోడ్డుపై మధ్యాహ్నం 1.45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి చెందిన అధికారులు ప్రమాదానికి గురయ్యారు. కాంక్రీట్ బ్యారియర్ని అతి వేగంతో కారు ఢీకొంది. ఆ తర్వాత కారు బోల్తా కొట్టింది. మంటలు వ్యాపించగా, ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ మిగతావారిని ఆసుపత్రికి తరలించారు. అల్ కాసిమి హాస్పిటల్లో వీరికి అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. వాహనదారులు రోడ్లపై అప్రమత్తంగా వుండాలనీ, అతి వేగం ప్రమాదాలకు ముఖ్య కారణమని షార్జా పోలీస్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఖాలిద్ మొహమ్మద్ అల్కే చెప్పారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం