తప్పిపోయిన యువకుడి ఆచూకీ లభ్యం
- January 25, 2019
కువైట్: తమ కుమారుడు తప్పిపోయాడంటూ ఓ యువకుడి గురించి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, తప్పిపోయిన యువకుడ్ని పోలీసులు గుర్తించి అతని తల్లిదండ్రులకు అప్పగించారు. 22 ఏళ్ళ సౌదీ బదర్ మొహమ్మద్ అల్ రషిదిని ఓ గేమింగ్ హాల్ ఉద్యోగి గుర్తించడంతో అతను పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు గేమింగ్ హాల్కి చేరుకుని, సౌద్ని తమ వెంట తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. సౌద్ మిలిటరీ మ్యాన్గా పనిచేస్తున్నాడనీ, గత కొంతకాలంగా అతని మానసిక స్థితి సరిగా లేదనీ హైపర్ థింకింగ్ సమస్యతో బాధడుతున్నాడనీ అతని అంకుల్ పోలీసులకు చెప్పారు. సౌద్ని తక్షణం ఆసుపత్రికి తరలించనున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







