వరుస బాంబు పేలుళ్లు..నలుగురు పోలీసులు మృతి
- January 27, 2019
సమర్రా: ఇరాక్ లోని అల్ షర్కత్ లో వరుస పేలుళ్లు సంభవించాయి. వరుస బాంబు పేలుళ్లలో నలుగురు ఇరాక్ పోలీసులు మృతి చెందారు. ఉదయం 8 గంటలకు అల్ షర్కత్ జిల్లా పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఓ బాంబు పేలింది. ఈ పేలుడులో ఇద్దరు పోలీస్ అధికారులు మృతి చెందగా..మరో 8 మంది పోలీసులు గాయపడ్డారు. గంట వ్యవధిలోనే రెండోసారి బాంబు పేలింది. ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు చనిపోగా..మరో ముగ్గురికి గాయాలయ్యాయని పట్టణ మేయర్ అలీ దోఢా తెలిపారు.
బాగ్దాద్ కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ షర్కత్ 2017వరకు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఆధీనంలో ఉండేది. అయితే ఇరాక్ ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. అప్పటినుంచి ఐఎస్ ఉగ్రవాదులు విధ్వంసాన్ని సృష్టించడం, అధికారులను కిడ్నాప్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..