ఐఏఎస్, ఐపీఎస్లు ఓల్వో బస్సుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు..
- December 26, 2015
విజయవాడ: లోటు బడ్జెట్లో ఉన్న ఏపీ ప్రభుత్వం వీలైనంత వరకు పొదుపు చర్యలు చేపట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలోపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు పొదుపు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబుకు ఆ శాఖ అధికారులు ప్రతిపాదన చేయడం..ఆయన పచ్చజెండా ఊపడం జరిగిపోయింది. దీంతో..ఇప్పటి వరకూ..ఐఏఎస్, ఐపీఎస్లు అధికారులు విజయవాడ నుంచి హైదరాబాద్కు విమానంలో ప్రయాణించేవారు. అయితే..ఆర్థిక శాఖ అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఐఏఎస్, ఐపీఎస్లు ఇక నుంచి ఓల్వో బస్సుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సి ఉంటుంది. వారు ప్రయాణించడానికి రెండు ఓల్వో బస్సులను ఏపీ ప్రభుత్వం అతి త్వరలోనే కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









