ఘోర విమాన ప్రమాదం.. 51 మంది ప్రాణాలు తీసిన సిగరెట్..
- January 28, 2019వరో చేసిన పొరపాటుకి మరెవరో బలవడం అంటే ఇదేనేమో. వందల మంది ప్రయాణీకులను గమ్యస్థానం చేరవేసే వాహనాల్లో ప్రధాన పాత్ర ధారి వాహనం నడిపే వ్యక్తి. అతడి మీద భరోసాతో ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ నిద్రలోకి జారుకుంటారు ప్రయాణీకులు.
విమానం నడిపే పైలెట్ నిర్లక్ష్యం కారణంగా 51 మంది ప్రయాణీకులు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఈ ఘటన గత ఏడాది మార్చిలో నేపాల్లో జరిగింది. దర్యాప్తు అనంతరం ప్రమాదానికి కారణం వెలుగు చూసింది. విమానం నడుపుతున్న పైలెట్ కాక్పిట్లో సిగరెట్ తాగడమే ఇంత మంది బలవడానికి కారణమైంది.
యూఎస్ బంగ్లా విమానయాన సంస్థకు చెందిన బంబార్డియర్ యూబీజీ-211 విమానాన్ని గత ఏడాది మార్చి 12 న నేపాల్లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగి విమానంలో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది సహా 51 మంది మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 67 మంది ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు కాక్పిట్లోని వాయిస్ రికార్డ్ని పరిశీలించింది.
నిబంధనలకు విరుద్ధంగా పైలెట్ కాక్పిట్లోనే పొగ తాగడంతో ల్యాండింగ్ సమయంలో పరిస్థితిపై అవగాహన కోల్పోయాడని తెలుసుకున్నారు. పైలెట్ సిగరెట్ తాగడం వల్లే ప్రమాదం జరిగి ఇంత మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ప్రయాణీకులతో పాటు పైలెట్కూడా దుర్మరణం పాలయ్యాడు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు