ఇటాలియన్ క్రూజ్ షిప్లో షేక్ మొహమ్మద్
- January 28, 2019
దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్లోని పోర్ట్ ఆఫ్ రషీద్లో ఇటలియన్ క్రూజ్ షిప్ ఎంఎస్సి స్ప్లెండిడాను సందర్శించారు. క్రూజ్ షిప్లో ఆయన కలియతిరిగారు. ఈ భారీ షిప్లో వున్న సౌకర్యాల్ని ఆయన తెలుసుకున్నారు. షిప్లో మొత్తం 1,300 మంది సిబ్బంది రోజులో 24 గంటలూ పనిచేస్తారు, షిప్లో వున్న అతిథులకు సహాయ సహకారాలు అందిస్తారు, వారి సేవలో తరిస్తారు. ప్రపంచంలోని వివిధ దేశాల పర్యాటకులకు యూఏఈ స్వర్గధామం లాంటిదని ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ చెప్పారు. టూరిజం రంగంలో అభివృద్ధి దేశానికి ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. షేక్ మొహమ్మద్ వెంట దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, ఎమిరేట్స్ గ్రూప్ ఛైర్మన్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి, డైర్టెర్ జనరల్ ఆఫ్ ది జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ - దుబాయ్ ఖలీఫా సయీద్ సులేమాన్ తదితరులు షిప్ని సందర్శించినవారిలో వున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!
- రీసైకిల్ పదార్థాలతో క్రెడిట్ కార్డుల తయారీ..!!
- అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం







