త్వరలో 4 కొత్త ట్రాఫిక్‌ జరీమానాలు

- January 30, 2019 , by Maagulf
త్వరలో 4 కొత్త ట్రాఫిక్‌ జరీమానాలు

యూఏఈ: నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే మోటరిస్టులకి తాజా హెచ్చరిక ఏంటంటే, కొత్తగా మరికొన్ని ట్రాఫిక్‌ జరీమానాలు విధించే దిశగా చర్యలు తీసుకోబోతున్నారు అథికారులు. పాదచారులకు మెరుగైన భద్రత కల్పించే దిశగా ఈ చర్యలు చేపడుతున్నారు. పెడెస్ట్రియన్‌ క్రాసింగ్‌ మీద వాహనాన్ని నిలిపితే 500 దిర్హామ్‌లు జరీమానా విధిస్తారు. రోడ్డు దాటుతున్న పాదచారులకు ఇబ్బంది కలిగేలా వాహనాలతో వ్యవహరిస్తే 400 దిర్హామ్‌ల జరీమానా విధిస్తారు. పేవ్‌మెంట్‌ మీద పార్క్‌ చేసే వెహికిల్స్‌కి విధించే 400 దిర్హామ్‌లు మూడో అంశం. జరీమానాలతోపాటు 4 బ్లాక్‌ పాయింట్స్‌ కూడా తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకో వైపు అబుదాబీ కొత్త ట్రాఫిక్‌ వార్నింగ్‌ రాడార్స్‌ని అమల్లోకి తీసుకురానుంది. స్కూల్స్‌ వుండే ప్రాంతాలు, అలాగే పాదచారుల క్రాసింగ్స్‌ వద్ద వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ కెమెరాలు వాహనాల నెంబర్‌ ప్లేట్లను గుర్తించి, జరీమానాలు విధిస్తాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com