గర్ల్స్‌ స్కూల్‌లో స్టౌ పేలడంతో భయాందోళనలు

- February 01, 2019 , by Maagulf
గర్ల్స్‌ స్కూల్‌లో స్టౌ పేలడంతో భయాందోళనలు

రస్‌ అల్‌ ఖైమాలోని ఓ గర్ల్స్‌ స్కూల్‌లో స్టౌ పేలడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. రస్‌ అల్‌ ఖైమా పోలీసులు మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సివిల్‌ డిఫెన్స్‌, పరిస్థితిని హుటాహుటిన అదుపులోకి తీసుకురావడం జరిగింది. గాయపడ్డ కొందరు విద్యార్థినులకు తక్షణ వైద్య సహాయం అందించి, ఆ తర్వాత వారిని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థుల్ని తమ తమ ఇళ్ళకు పంపించివేశారు. అల్‌ ధయిత్‌ సెకెండరీ స్కూల్‌ ఫర్‌ గర్ల్స్‌లో ఓ పార్టీ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. అధికారులు ఘటన జరిగిన వైనంపై ఆరా తీస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com