గర్ల్స్ స్కూల్లో స్టౌ పేలడంతో భయాందోళనలు
- February 01, 2019
రస్ అల్ ఖైమాలోని ఓ గర్ల్స్ స్కూల్లో స్టౌ పేలడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. రస్ అల్ ఖైమా పోలీసులు మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్, పరిస్థితిని హుటాహుటిన అదుపులోకి తీసుకురావడం జరిగింది. గాయపడ్డ కొందరు విద్యార్థినులకు తక్షణ వైద్య సహాయం అందించి, ఆ తర్వాత వారిని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థుల్ని తమ తమ ఇళ్ళకు పంపించివేశారు. అల్ ధయిత్ సెకెండరీ స్కూల్ ఫర్ గర్ల్స్లో ఓ పార్టీ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. అధికారులు ఘటన జరిగిన వైనంపై ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







