గర్ల్స్ స్కూల్లో స్టౌ పేలడంతో భయాందోళనలు
- February 01, 2019
రస్ అల్ ఖైమాలోని ఓ గర్ల్స్ స్కూల్లో స్టౌ పేలడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. రస్ అల్ ఖైమా పోలీసులు మధ్యాహ్నం 1.30 నిమిషాల సమయంలో ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్, పరిస్థితిని హుటాహుటిన అదుపులోకి తీసుకురావడం జరిగింది. గాయపడ్డ కొందరు విద్యార్థినులకు తక్షణ వైద్య సహాయం అందించి, ఆ తర్వాత వారిని ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థుల్ని తమ తమ ఇళ్ళకు పంపించివేశారు. అల్ ధయిత్ సెకెండరీ స్కూల్ ఫర్ గర్ల్స్లో ఓ పార్టీ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది. అధికారులు ఘటన జరిగిన వైనంపై ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!







