ఎన్నికల వేళాయెరా..వాట్సాప్ వార్నింగ్!
- February 07, 2019
న్యూఢిల్లీ: పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ దేశంలోని రాజకీయ పార్టీలకు హెచ్చరికలు జారీ చేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమ యాప్ను దుర్వినియోగం చేసే అవకాశం ఉండటంతో వాట్సాప్ రంగంలోకి దిగింది. ఇప్పటికే పార్టీలు తమ యాప్ను దుర్వినియోగం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. ఇప్పుడు ఎన్నికల ముందు మరోసారి అలా చేస్తే సదరు అకౌంట్లను నిషేధిస్తామని హెచ్చరించింది. చాలా వరకు రాజకీయ పార్టీలు మా యాప్ను ఎలా వాడాలో అలా వాడటం లేదు. మా ప్లాట్ఫామ్ను పూర్తిగా దుర్వినియోగం చేశారు. ఇలా చేస్తే వాటిని నిషేధించాల్సి ఉంటుంది అని వాట్సాప్ కమ్యూనికేషన్స్ హెడ్ కార్ల్ వూగ్ వెల్లడించారు. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వాట్సాప్ దుర్వినియోగం జరగకుండా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. అటు ప్రభుత్వం కూడా ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. చట్ట విరుద్ధమైన ఎలాంటి సమాచారమైనా తమ యాప్స్ ద్వారా వ్యాప్తి చెందకుండా అన్ని సంస్థలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నది. వాట్సాప్ అనేది ప్రైవేట్ కమ్యూనికేషన్స్ కోసం మాత్రమే అని, అసహజ సందేశాలు పంపించే నంబర్లను నిషేధించినట్లు కార్ల్ వూగ్ చెప్పారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







