ఎన్నికల వేళాయెరా..వాట్సాప్ వార్నింగ్!
- February 07, 2019
న్యూఢిల్లీ: పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ దేశంలోని రాజకీయ పార్టీలకు హెచ్చరికలు జారీ చేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు తమ యాప్ను దుర్వినియోగం చేసే అవకాశం ఉండటంతో వాట్సాప్ రంగంలోకి దిగింది. ఇప్పటికే పార్టీలు తమ యాప్ను దుర్వినియోగం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. ఇప్పుడు ఎన్నికల ముందు మరోసారి అలా చేస్తే సదరు అకౌంట్లను నిషేధిస్తామని హెచ్చరించింది. చాలా వరకు రాజకీయ పార్టీలు మా యాప్ను ఎలా వాడాలో అలా వాడటం లేదు. మా ప్లాట్ఫామ్ను పూర్తిగా దుర్వినియోగం చేశారు. ఇలా చేస్తే వాటిని నిషేధించాల్సి ఉంటుంది అని వాట్సాప్ కమ్యూనికేషన్స్ హెడ్ కార్ల్ వూగ్ వెల్లడించారు. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వాట్సాప్ దుర్వినియోగం జరగకుండా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. అటు ప్రభుత్వం కూడా ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. చట్ట విరుద్ధమైన ఎలాంటి సమాచారమైనా తమ యాప్స్ ద్వారా వ్యాప్తి చెందకుండా అన్ని సంస్థలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నది. వాట్సాప్ అనేది ప్రైవేట్ కమ్యూనికేషన్స్ కోసం మాత్రమే అని, అసహజ సందేశాలు పంపించే నంబర్లను నిషేధించినట్లు కార్ల్ వూగ్ చెప్పారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







