ఎన్నికల వేళాయెరా..వాట్సాప్ వార్నింగ్!

- February 07, 2019 , by Maagulf
ఎన్నికల వేళాయెరా..వాట్సాప్ వార్నింగ్!

న్యూఢిల్లీ: పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ దేశంలోని రాజకీయ పార్టీలకు హెచ్చరికలు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ యాప్‌ను దుర్వినియోగం చేసే అవకాశం ఉండటంతో వాట్సాప్ రంగంలోకి దిగింది. ఇప్పటికే పార్టీలు తమ యాప్‌ను దుర్వినియోగం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది. ఇప్పుడు ఎన్నికల ముందు మరోసారి అలా చేస్తే సదరు అకౌంట్లను నిషేధిస్తామని హెచ్చరించింది. చాలా వరకు రాజకీయ పార్టీలు మా యాప్‌ను ఎలా వాడాలో అలా వాడటం లేదు. మా ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా దుర్వినియోగం చేశారు. ఇలా చేస్తే వాటిని నిషేధించాల్సి ఉంటుంది అని వాట్సాప్ కమ్యూనికేషన్స్ హెడ్ కార్ల్ వూగ్ వెల్లడించారు. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వాట్సాప్ దుర్వినియోగం జరగకుండా కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు. అటు ప్రభుత్వం కూడా ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. చట్ట విరుద్ధమైన ఎలాంటి సమాచారమైనా తమ యాప్స్ ద్వారా వ్యాప్తి చెందకుండా అన్ని సంస్థలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నది. వాట్సాప్ అనేది ప్రైవేట్ కమ్యూనికేషన్స్ కోసం మాత్రమే అని, అసహజ సందేశాలు పంపించే నంబర్లను నిషేధించినట్లు కార్ల్ వూగ్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com