తెలంగాణా వాసికి విమాన టిక్కెట్ వితరణ
- December 27, 2015
పొట్ట కూటి కోసం అరబ్ దేశాలకు వచ్చి, ఇక్కడే చాలీ చాలని రాబడితో బతుకు ఈడుస్తున్న ఎందరో అభాగ్యులున్నారు. దారి ఖర్చులు భరించలేక, ఎంత అత్యవసరమైనా స్వదేశానికి వెళ్ళలేని దుస్థితి కొందరిది. అలాంటివారిని ఆదుకునే క్రమంలో ఏక్తా - ఇండియన్ కల్చరల్ టీమ్, తెలుగు ఐక్యం, మా గల్ఫ్ టీమ్ సంయుక్తంగా ఓ కార్యక్రమం చేపట్టింది. మల్లయ్య అనే వ్యక్తికి ఇండియా వెళ్ళడానికి టిక్కెట్, మరియు ఇతర అవసరాల నిమిత్తం సహాయం చేయడం ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం. ఏక్తా - ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ తరఫున జయరాజయ్, టిక్కెట్ను స్పాన్సర్ చేశారు. ఇతర ఎక్స్పెన్సెస్ను రాజేష్బాబు, యాదవ్ రాగం, శ్రీకాంత్ (మా గల్ఫ్), సుధీర్ ముఖర్జీ, శాంతి, సురేష్, హనీఫ్, బిర్యానీ ప్యాలెస్ రెస్టారెంట్ - అబ్దుల్ రవూఫ్, క్లాసిక్ రెస్టారెంట్, వసంత్కుమార్. కాన్సెప్ట్ ఇయేషన్ ఎగ్జిక్యూటెడ్ బై: అరవింద్ బాబు యాదవ్ రాగం. సైట్ అసిస్టెడ్: పోష్ శెట్టి, అజెందర్రావు, సత్యం గౌడ్. మలయ్య ఆరేళ్ళుగా ఇండియాకి వెళ్ళలేకపోతున్నాడు. కుమార్తె వివాహానికి కూడా హాజరు కాలేకపోయాడు మల్లయ్య. ఆయన కుమారుడి చదువు కోసమే ఆయన శ్రమిస్తున్నాడు. అతనికి తమవంతు సాయంగా ఈ కార్యక్రమం చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.


తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







