తెలంగాణ:ఆన్లైన్లోనే మ్యారేజ్ ముస్లీం సర్టిఫికెట్
- February 11, 2019
హైదరాబాద్: ముస్లిములు మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తు కోసం వక్ఫ్బోర్డు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకునే విధంగా ఈ-ఖజ్జత్(ఆన్లైన్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తు) విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఈ రోజు వక్ఫ్బోర్డు కార్యాలయంలో ఆన్లైన్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తు విధానాన్ని మహమూద్ అలీ, వక్ఫ్బోర్డు ఛైర్మన్, ఎమ్మెల్సీ సలీం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధానం లేదని, ప్రజల సమస్యల పరిష్కారాన్ని మరింత సులభతరం చేసేందుకే ఈ-ఖజ్జత్ విధానాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. గతంలో ప్రతి రోజు 300 నుంచి 400 మంది వరకు మ్యారేజ్ సర్టిఫికెట్ల దరఖాస్తుల కోసం వక్ఫ్బోర్డు కార్యాలయానికి వచ్చే వారని, ఇప్పుడు ఆ సమస్య తలెత్తదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, గడువు తేదీన కార్యాలయానికి వచ్చి సర్టిఫికెట్ తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. WAQF.TELANGANA.GOV.IN వెబ్సైట్లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







