ఢిల్లీ హోటల్ ఆర్పిట్ ప్యాలెస్లో అగ్నిప్రమాదం..17 మంది సజీవ దహనం
- February 12, 2019
దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్బాగ్ ప్రాంతంలో గల హోటల్ ఆర్పిట్ ప్యాలెస్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది సజీవదహన మయ్యారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు.
తీవ్రంగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తుంది. గాయపడ్డ పలువురిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు.
సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సుమారు 26 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధంచి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. భారీగా అగ్ని ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..