యజమాని కారు దహనం కేసులో మెయిడ్పై విచారణ
- February 13, 2019
యూ.ఏ.ఈ:తన యజమాని కారుని దహనం చేసిన కేసులో మెయిడ్ విచారణను ఎదుర్కొంటోంది. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు, మెయిడ్ని అరెస్ట్ చేశారు. రాత్రి 12 గంటల సమయంలో మెయిడ్, కారుని గ్యాసోలైన్తో తగలబెట్టింది. కారు తగలబడుతుండడాన్ని గమనించిన యజమాని వెంటనే సివిల్ డిఫెన్స్ సిబ్బందికి సమాచారం తెలుపగా, వెంటనే రంగంలోకి దిగిన సివిల్ డిఫెన్స్ మంటల్ని ఆర్పివేశారు. అయితే తన మీద వస్తున్న ఆరోపణల్ని మెయిడ్ ఖండిస్తోంది. మంటల్ని ఆర్పివేసేందుకు తాను ప్రయత్నించానని, ఆ మంటలు ఎలా వ్యాపించాయో తనకు తెలియదని అంటోందామె. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







