రైల్వేలో 12 వేల ఉద్యోగాలు
- February 14, 2019
హైదరాబాద్: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలామంది మక్కువ చూపుతుంటారు. అందులోనే రైల్వేలో ఉద్యోగమంటే..ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ క్రమంలో రైల్వే శాఖలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ఆరు డిపార్ట్ మెంట్స్ లలో మొత్తం 12,433 ఉద్యోగాలను భర్తీ రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ), రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ)ల ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న ద.మ. రైల్వే జోన్ భారతీయ రైల్వేలో సహా ఇతర జోన్లలోనూ ఎక్కువమొత్తంలో పోస్టులు ఖాళీలున్నాయి. వీటికి త్వరలో నియామకాలు చేపడతామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఖాళీలు, 2020 సంవత్సరానివి కూడా కలిపి దేశవ్యాప్తంగా 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. దీంట్లో భాగంగా..ఫిబ్రవరి నెలలో దాదాపు 1.31 లక్షల ఉద్యోగాలను ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీల ద్వారా భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ జాబితాలో ద.మ రైల్వే పరిధిలో 12వేల పైచిలుకు ఉద్యోగాలను చేర్చారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







