మహేష్ బాబుకు అరుదైన గౌరవం..
- February 15, 2019
తెలుగు సూపర్స్టార్ మహేష్ బాబుకు అరుదైన గౌరవం దక్కనుంది. గత ఏప్రిల్లో మహేష్ బాబు మైనపు బొమ్మను తయారు చేస్తున్నట్లు ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ ప్రకటించింది. ముందుగా అనుకున్నట్లే ఆ మైనపు బొమ్మ తయారీ పూర్తిచేసింది. మలేషియాలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అతి త్వరలో మహేష్ బాబు మైనపు ప్రతిమ కొలువుదీరనుంది. ఈలోగా ఆ మైనపు ప్రతిమను హైదరాబాద్లో ఒకరోజు ప్రదర్శించాలని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ నిర్వాహకులు నిర్ణయించారు. ఇలా ఒక నటుడి మైనపు ప్రతిమను సొంత నగరంలో అభిమానుల మధ్య ప్రదర్శించడం మేడమ్ టుస్సాడ్స్ సంస్థకు ఇదే తొలిసారి. ఈ విధంగా మహేష్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఏప్రిల్లో మహర్షి ఘనంగా విడుదలయ్యేందుకు సన్నాహాలు చేసుకుంటోంది.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







