పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిన మోడీ
- February 15, 2019
కాశ్మీర్ దాడి తర్వాత దేశంలో ప్రతిఒక్కరి రక్తం మరిగిపోతుందని.. ప్రతీకారం తీర్చుకుందామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అటు తీవ్రవాద సంస్థలను హెచ్చరించారు. దేశం ప్రగతిని అడ్డుకునేందుకు తీవ్రవాదులు కుట్రలు చేస్తున్నారని.. అవేమీ అభివృద్ధిని ఆపలేవన్నారు. దేశం రెట్టించిన ఉత్సాహంతో మరింత ప్రగతి సాధించి అమరులకు నిజమైన నివాళి అర్పిద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించేరోజు వస్తుందన్నారు. ఉగ్రవాదులు, ఐఎస్ఐ లాంటి సంస్థలు కుట్రలను ఛేదించడానికి సైనికులు ఏకమవుతారన్నారు. దేశప్రజలంతా అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటారన్నారు. ఇలాంటి దాడులతో సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని మోదీ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం







