పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చిన మోడీ
- February 15, 2019కాశ్మీర్ దాడి తర్వాత దేశంలో ప్రతిఒక్కరి రక్తం మరిగిపోతుందని.. ప్రతీకారం తీర్చుకుందామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అటు తీవ్రవాద సంస్థలను హెచ్చరించారు. దేశం ప్రగతిని అడ్డుకునేందుకు తీవ్రవాదులు కుట్రలు చేస్తున్నారని.. అవేమీ అభివృద్ధిని ఆపలేవన్నారు. దేశం రెట్టించిన ఉత్సాహంతో మరింత ప్రగతి సాధించి అమరులకు నిజమైన నివాళి అర్పిద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించేరోజు వస్తుందన్నారు. ఉగ్రవాదులు, ఐఎస్ఐ లాంటి సంస్థలు కుట్రలను ఛేదించడానికి సైనికులు ఏకమవుతారన్నారు. దేశప్రజలంతా అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటారన్నారు. ఇలాంటి దాడులతో సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని మోదీ గుర్తుచేశారు.
తాజా వార్తలు
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు