జల్లికట్టు పోటీలు.. 1700 మంది పోటాపోటీ..

- February 18, 2019 , by Maagulf
జల్లికట్టు పోటీలు.. 1700 మంది పోటాపోటీ..

తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం కోయంబత్తూర్‌లో జరిగిన ఈ సంప్రదాయ క్రీడలో పెద్ద ఎత్తున యువత పాల్లొన్నారు. కోడెలను కంట్రోల్ చేసే ప్రయత్నంలో దాదాపు 40 మంది గాయపడ్డారు. 740 ఎద్దుల్ని లొంగదీసుకునేందుకు.. 1700 మంది పోటాపోటీగా రంగంలోకి దిగారు. దాదాపు 40 వేల మంది జల్లికట్టు తిలగించేందుకు తరలివచ్చారు. పోటీలో 13కిపైగా ఎద్దుల్ని లొంగదీసుకున్న కార్తీక్ అనే యువకుడు కార్ గెలుచుకున్నాడు. అటు, ఈ పోటీలు ప్రారంభించడానికి ముందు పుల్వామా అమరవీరులకు నివాళులు అర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com