భారతదేశంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ పర్యటన
- February 20, 2019
సౌదీ క్రౌన్ ప్రిన్స మొహమ్మద్ బిన్ సల్మాన్ భారతదేశం చేరుకున్నారు. పాకిస్తాన్ పర్యటనను ముగించుకుని భారత్కి చేరుకున్న సౌదీ క్రౌన్స్ ప్రిన్స్కి భారత ప్రభుత్వం స్వాగతం పలికింది. ఎయిర్పోర్ట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, సౌదీ క్రౌన్ ప్రిన్స్ని కలిశారు. భారత్ - పాక్ మధ్య నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నడుమ సౌదీ క్రౌన్ ప్రిన్స్ పాక్ పర్యటన ముగించుకుని, భారత్కి రావడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ - సౌదీ అరేబియా మధ్య సంబంధాలు, అలాగే ప్రపంచానికి పెను ముప్పుగా మారిన తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్ భారత పరట్యనలో చర్చలు జరిగే అవకాశం వుంది. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న భారతీయుల భద్రతకు సంబంధించి సైతం మోడీ - క్రౌన్ ప్రిన్స్ మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సౌదీ - భారత్ మధ్య 27.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







