భారతదేశంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ పర్యటన
- February 20, 2019
సౌదీ క్రౌన్ ప్రిన్స మొహమ్మద్ బిన్ సల్మాన్ భారతదేశం చేరుకున్నారు. పాకిస్తాన్ పర్యటనను ముగించుకుని భారత్కి చేరుకున్న సౌదీ క్రౌన్స్ ప్రిన్స్కి భారత ప్రభుత్వం స్వాగతం పలికింది. ఎయిర్పోర్ట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, సౌదీ క్రౌన్ ప్రిన్స్ని కలిశారు. భారత్ - పాక్ మధ్య నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నడుమ సౌదీ క్రౌన్ ప్రిన్స్ పాక్ పర్యటన ముగించుకుని, భారత్కి రావడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ - సౌదీ అరేబియా మధ్య సంబంధాలు, అలాగే ప్రపంచానికి పెను ముప్పుగా మారిన తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్ భారత పరట్యనలో చర్చలు జరిగే అవకాశం వుంది. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న భారతీయుల భద్రతకు సంబంధించి సైతం మోడీ - క్రౌన్ ప్రిన్స్ మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సౌదీ - భారత్ మధ్య 27.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో పిల్లల దోపిడీ ఘటనలు పెరగడంపై OHRC ఆందోళన..!!
- భారత్ ఖాతాలో మరో మూడు మెడల్స్
- ఫోరెన్సిక్ సైన్స్ విజయవంతమైన నేర విచారణకు వెన్నెముక: డీజీపీ సీవీ ఆనంద్
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్







