భారతదేశంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ పర్యటన
- February 20, 2019
సౌదీ క్రౌన్ ప్రిన్స మొహమ్మద్ బిన్ సల్మాన్ భారతదేశం చేరుకున్నారు. పాకిస్తాన్ పర్యటనను ముగించుకుని భారత్కి చేరుకున్న సౌదీ క్రౌన్స్ ప్రిన్స్కి భారత ప్రభుత్వం స్వాగతం పలికింది. ఎయిర్పోర్ట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, సౌదీ క్రౌన్ ప్రిన్స్ని కలిశారు. భారత్ - పాక్ మధ్య నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నడుమ సౌదీ క్రౌన్ ప్రిన్స్ పాక్ పర్యటన ముగించుకుని, భారత్కి రావడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్ - సౌదీ అరేబియా మధ్య సంబంధాలు, అలాగే ప్రపంచానికి పెను ముప్పుగా మారిన తీవ్రవాదాన్ని అంతమొందించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్ భారత పరట్యనలో చర్చలు జరిగే అవకాశం వుంది. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న భారతీయుల భద్రతకు సంబంధించి సైతం మోడీ - క్రౌన్ ప్రిన్స్ మధ్య చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సౌదీ - భారత్ మధ్య 27.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









