బంగ్లాదేశ్:ఘోర అగ్నిప్రమాదం.. 70మంది మృతి

- February 21, 2019 , by Maagulf
బంగ్లాదేశ్:ఘోర అగ్నిప్రమాదం.. 70మంది మృతి

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 70మంది మృత్యువాత పడినట్టు అధికారులు ప్రకటించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రిలో 45 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మొత్తం 2వందలకు పైగా ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓ పాత అపార్ట్‌మెంట్‌ భవంతిలో గ్యాస్‌ సిలెండర్‌ పేలి మంటలు అందుకున్నట్టు ప్రాధమికంగా గుర్తించారు.

ఢాకాలో పాతబస్తీ అయిన చౌక్‌బజార్‌ లో ఈ ప్రమాదం జరిగింది. అత్యంత ఇరుకుగా రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రమాదతీవ్రత పెరిగింది. మంటలందుకున్న అపార్ట్‌మెంట్‌ కిందనే కెమికల్‌, ప్లాస్టిక్‌ గోదాములున్నాయి. వాటికి మంటలు అంటుకోవడంతో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ఇరుకు రోడ్లు కావడంతో ప్రమాదం వల్ల ట్రాఫిక్‌ జామ్‌ అయింది. అక్కడే నిలిచిపోయిన వాహనదారులు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుని మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com