బంగ్లాదేశ్:ఘోర అగ్నిప్రమాదం.. 70మంది మృతి
- February 21, 2019
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 70మంది మృత్యువాత పడినట్టు అధికారులు ప్రకటించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రిలో 45 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మొత్తం 2వందలకు పైగా ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓ పాత అపార్ట్మెంట్ భవంతిలో గ్యాస్ సిలెండర్ పేలి మంటలు అందుకున్నట్టు ప్రాధమికంగా గుర్తించారు.
ఢాకాలో పాతబస్తీ అయిన చౌక్బజార్ లో ఈ ప్రమాదం జరిగింది. అత్యంత ఇరుకుగా రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రమాదతీవ్రత పెరిగింది. మంటలందుకున్న అపార్ట్మెంట్ కిందనే కెమికల్, ప్లాస్టిక్ గోదాములున్నాయి. వాటికి మంటలు అంటుకోవడంతో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ఇరుకు రోడ్లు కావడంతో ప్రమాదం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడే నిలిచిపోయిన వాహనదారులు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుని మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







