బంగ్లాదేశ్:ఘోర అగ్నిప్రమాదం.. 70మంది మృతి
- February 21, 2019
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 70మంది మృత్యువాత పడినట్టు అధికారులు ప్రకటించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రిలో 45 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మొత్తం 2వందలకు పైగా ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓ పాత అపార్ట్మెంట్ భవంతిలో గ్యాస్ సిలెండర్ పేలి మంటలు అందుకున్నట్టు ప్రాధమికంగా గుర్తించారు.
ఢాకాలో పాతబస్తీ అయిన చౌక్బజార్ లో ఈ ప్రమాదం జరిగింది. అత్యంత ఇరుకుగా రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రమాదతీవ్రత పెరిగింది. మంటలందుకున్న అపార్ట్మెంట్ కిందనే కెమికల్, ప్లాస్టిక్ గోదాములున్నాయి. వాటికి మంటలు అంటుకోవడంతో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ఇరుకు రోడ్లు కావడంతో ప్రమాదం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడే నిలిచిపోయిన వాహనదారులు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుని మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన
- పాన్ కార్డు ఉన్నవారికి కొత్త రూల్స్..ఇక నుంచి ఈ లావాదేవీలకు తప్పనిసరి
- ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!
- ఏప్రిల్లో బహ్రెయిన్ ఆపరేషన్స్ రూమ్ కు 1,606 కాల్స్..!!
- 7 రోజుల్లో 7,989 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- జూన్ 13 యూఏఈ లాటరీ డ్రా.. విజేత నంబర్లు ఇవే..!!
- పిల్లలలో అవాంఛిత ప్రవర్తన నివారణకు క్లోజ్ మానిటరింగ్..!!
- ఒమన్ లో ఒక్క రోజులోనే భారతీయ పాస్ పోర్ట్ ప్రక్రియ పూర్తి..!!









