బంగ్లాదేశ్:ఘోర అగ్నిప్రమాదం.. 70మంది మృతి
- February 21, 2019బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 70మంది మృత్యువాత పడినట్టు అధికారులు ప్రకటించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రిలో 45 మంది చికిత్స పొందుతున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. మొత్తం 2వందలకు పైగా ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓ పాత అపార్ట్మెంట్ భవంతిలో గ్యాస్ సిలెండర్ పేలి మంటలు అందుకున్నట్టు ప్రాధమికంగా గుర్తించారు.
ఢాకాలో పాతబస్తీ అయిన చౌక్బజార్ లో ఈ ప్రమాదం జరిగింది. అత్యంత ఇరుకుగా రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో ప్రమాదతీవ్రత పెరిగింది. మంటలందుకున్న అపార్ట్మెంట్ కిందనే కెమికల్, ప్లాస్టిక్ గోదాములున్నాయి. వాటికి మంటలు అంటుకోవడంతో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. ఇరుకు రోడ్లు కావడంతో ప్రమాదం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడే నిలిచిపోయిన వాహనదారులు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుని మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం