పీఓకేలో ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడి
- February 26, 2019
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని మూడు చోట్ల భారత వైమానిక దళం మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారత వైమానిక దళానికి చెందిన 12 యుద్ధ విమానాలు పాలుపంచుకున్నాయి. భారత వైమానిక దళం దాడితో, ఉగ్ర స్థావరాల్లో వున్న సుమారు 350 మందికి పైగా తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ దాడిని పాకిస్తాన్ ఖండిస్తుండగా, భారతదేశంలో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఇటీవల పుల్వామాలో తీవ్రవాద ఘటనతో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఆ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పీఓకేపై వైమానిక దాడులకు రూపకల్పన చేసింది. ఇదిలా వుంటే, పాకిస్తాన్ వైపు నుంచి సైనిక దాడి జరిగే అవకాశం వుందన్న కోణంలో సరిహద్దుల్లో భారత సైన్యం, పూర్తిస్థాయిలో మోహరించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







