పీఓకేలో ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడి
- February 26, 2019
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని మూడు చోట్ల భారత వైమానిక దళం మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారత వైమానిక దళానికి చెందిన 12 యుద్ధ విమానాలు పాలుపంచుకున్నాయి. భారత వైమానిక దళం దాడితో, ఉగ్ర స్థావరాల్లో వున్న సుమారు 350 మందికి పైగా తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ దాడిని పాకిస్తాన్ ఖండిస్తుండగా, భారతదేశంలో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఇటీవల పుల్వామాలో తీవ్రవాద ఘటనతో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఆ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పీఓకేపై వైమానిక దాడులకు రూపకల్పన చేసింది. ఇదిలా వుంటే, పాకిస్తాన్ వైపు నుంచి సైనిక దాడి జరిగే అవకాశం వుందన్న కోణంలో సరిహద్దుల్లో భారత సైన్యం, పూర్తిస్థాయిలో మోహరించింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







