పీఓకేలో ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడి

- February 26, 2019 , by Maagulf
పీఓకేలో ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడి

పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని మూడు చోట్ల భారత వైమానిక దళం మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారత వైమానిక దళానికి చెందిన 12 యుద్ధ విమానాలు పాలుపంచుకున్నాయి. భారత వైమానిక దళం దాడితో, ఉగ్ర స్థావరాల్లో వున్న సుమారు 350 మందికి పైగా తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ దాడిని పాకిస్తాన్‌ ఖండిస్తుండగా, భారతదేశంలో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఇటీవల పుల్వామాలో తీవ్రవాద ఘటనతో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. ఆ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పీఓకేపై వైమానిక దాడులకు రూపకల్పన చేసింది. ఇదిలా వుంటే, పాకిస్తాన్‌ వైపు నుంచి సైనిక దాడి జరిగే అవకాశం వుందన్న కోణంలో సరిహద్దుల్లో భారత సైన్యం, పూర్తిస్థాయిలో మోహరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com