పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అమెరికా
- February 27, 2019
పాకిస్థాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇండియాతో పెట్టుకోవద్దనీ..అలా చేస్తే పాకిస్థాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇండియాపై దాడులకు పాల్పడి కవ్వించే చర్యలు చేయవద్దని హితవు పలికారు. ఈ క్రమంలో పాక్ భూభాగంపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను పాకిస్థాన్ వెంటనే నాశనం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
పాకిస్థాన్ ఏ ఒక్క ఉగ్రవాదికి మద్దతు పలికినా..అది దేశాని వినాశనానికి దారి తీస్తుందని..ప్రస్తుతం వియత్నాం పర్యటనలో ఉన్న మీడియాతో మాట్లాడిన ట్రంప్ పాకిస్థాన్ కు హితవు పలికారు. పాకిస్థాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. ఉగ్రవాదంపై తీరును ఇప్పటికైనా మార్చుకోవాలని ఎంతో కాలంగా పాకిస్థాన్ ప్రభుత్వాన్ని తాము కోరుతూనే ఉన్నామన్నారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కు కూడా అదే మాట చెబుతున్నామని అన్నారు. యుద్ధమే జరిగితే అత్యధిక నష్టం పాక్ కు జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ ట్రంప్ పాకిస్థాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







