అబుదాబి చేరిన భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్
- March 01, 2019
అబుదాబి: ఇస్లామిక్ సహకార సంస్థ(ఓఐసీ) సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అబుదాబి చేరారు. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవనున్న సుష్మ.. ఓఐసీ భాగస్వామ్య దేశాలతో భారత్ సంబంధాలపై ప్రసంగించనున్నారు. దీనికోసం యూఏఈ విదేశాంగ మంత్రి హెచ్హెచ్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రత్యేకంగా సుష్మను ఆహ్వానించారు. ఈ సమావేశానికి భారత్ హాజరైతే తాము పాల్గొనబోమని పాక్ బెదిరించినా. వారి బెదిరింపులను లెక్కచేయని నహ్యాన్ సుష్మను సమావేశానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే అబుదాబి యువరాజు మహమ్మద్ బిన్ జాయెద్ స్వయంగా ఇరుదేశాల ప్రధానులతో మాట్లాడారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించువాలని సూచించినట్లు సమాచారం.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









