రాష్ట్రపతి గౌరవార్ధం గవర్నర్‌ నరసింహన్‌ విందు..

- December 28, 2015 , by Maagulf
రాష్ట్రపతి గౌరవార్ధం గవర్నర్‌ నరసింహన్‌ విందు..

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మంగళవారం రాజ్‌భవన్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి గౌరవార్ధం గవర్నర్‌ నరసింహన్‌ విందు ఇవ్వనున్నారు. ఈ విందులో రెండు తెలుగు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు నాయుడు పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలిసింది.అయితే ప్రణబ్‌ రాకతో రాత్రి 7.30 నుంచి 8.30 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, రాష్ట్రపతి ప్రణబ్‌ శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు హైదరాబాద్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com