భారత్కు షాక్ ఇచ్చిన ట్రంప్
- March 05, 2019ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయం భారత ఎగుమతిదారులకు తీవ్రంగా నష్టపరుస్తుంది. ఎగుమతులు తగ్గిపోయే అవకాశాలున్నాయి. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థకు ఇబ్బందిగా మారనుంది. అయితే భారత్ మార్కెట్లలో కూడా తమ ఉత్పత్తులకు ప్రిఫరెన్సినల్ ట్రేడ్ స్టేటస్ ఇవ్వాలని అమెరికా కోరింది. అయితే అతిపెద్ద దిగుమతిదారు అయిన భారత్ ఇందుకు అంగీకరిస్తే బారత్ కు వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోతుంది. దీంతో భారత్ నిరాకరిస్తూ వస్తోంది. దీంతో బారత్ పై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారు. భారత్తో అమెరికా వర్తక లోటును తగ్గించే క్రమంలో ట్రంప్ ఈ దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. 2017లో భారత్తో అమెరికా వాణిజ్య లోటు 2730 కోట్ల డాలర్లుగా ఉంది. పన్నుల కారణంగానే తగ్గినట్టు ట్రంప్ భావిస్తున్నారు. తమకు కూడా ప్రాధాన్యత హోదా ఇస్తే పెరుగుతుందని ట్రంప్ నమ్ముతున్నారు. 2017లో ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా భారీగా భారత ప్రయోజనాలకు విఘాతం కలిగే చర్య ఇదే కావడం గమనార్హం.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు