హైదరాబాద్-కొలంబో మధ్య కొత్త విమాన సర్వీసు
- March 05, 2019
హైదరాబాద్:బడ్జెట్ ఎయిర్లైన్స్ స్పైస్ జెట్ కొత్త విమాన సర్వీసులను ప్రకటించింది. హైదరాబాద్-కొలంబో మార్గంలో 12 కొత్త విమానాలను నడుపుతామని స్పైస్ జెట్ మంగళవారం ప్రకటించింది. ఏప్రిల్ 12నుంచి మార్చి 31 నుంచి తమ సేవలను ప్రారంభించనున్నాయి. మంగళవారం, బుధవారాలు మినహా అన్ని రోజులు ఈ విమానాలు నడుస్తాయని పేర్కొంది. శ్రీలకం, భారత్ మధ్య డైరెక్ట్ విమాన సదుపాయాన్ని అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారి.
దీంతోపాటు జాతీయ మార్గంలో మరో11డైరెక్ట్ విమానాలను తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. ఇవి మార్చి 31 నుంచి సర్వీసులను ప్రారంభిస్తాయని స్పైస్ జెట్ వెల్లడించింది.
హైదరాబాద్- కొలంబో(శ్రీలంక రాజధాని) డైరెక్ట్ సర్వీసులు భారతదేశం శ్రీలంకల మధ్య సంబంధాలకు మద్దతిచ్చేలా తమ నిబద్ధతను మరింత బలపరుస్తోందని స్పైస్ జెట్ చీఫ్ సేల్స్ అండ్ రెవెన్యూ ఆఫీసర్ శిల్పా భాటియా చెప్పారు.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









