తెలంగాణ:నేడు ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు సెలవు

- March 08, 2019 , by Maagulf
తెలంగాణ:నేడు ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు సెలవు

హైదరాబాద్:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 శుక్రవారం తెలంగాణలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు టీసర్కార్ సెలవు ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత, ఇతర నేతల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ సచివాలయంలో మార్చి 7 గురువారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సచివాలయ సంఘం ఉపాధ్యక్షురాలు నేతి మంగమ్మ, ఇతర నేతలు సుజాత, ఉమ, కరుణ, మంజుల ఆధ్వర్యంలో క్రీడలు, ఇతర పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రిటైర్డ్ మహిళా ఉద్యోగులకు సన్మానం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com