చైనా తీరు మారలేదు..అజర్ ను మళ్ళీ వెనకేసుకొస్తున్న చైనా
- March 14, 2019బీజింగ్: మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనను మరోసారి అడ్డుకున్న చైనా.. తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఈ అంశంలో మరింత లోతైన విచారణ చేపట్టడానికి ఇంకా సమయం కావాలని చైనా చెప్పడం గమనార్హం. అదే సమయంలో తాము ఇండియాతో మంచి సంబంధాలనే కోరుకుంటున్నామని, ఇలాంటి అంశాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసమే తాము చూస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లూ కాంగ్ వివరించారు. అమెరికా, యూకే, ఫ్రాన్స్ తీసుకొచ్చిన ఈ తీర్మానాన్ని ఎందుకు అడ్డుకున్నారు అని ప్రశ్నించగా.. ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీకి వచ్చే ప్రతి దరఖాస్తునూ చైనా క్షుణ్నంగా, లోతుగా పరిశీలిస్తుందని, దీనికి మరింత సమయం కావాలని లూ కాంగ్ చెప్పారు. ఓ వ్యక్తి లేదా సంస్థపై ఉగ్రవాద ముద్ర వేయడానికి భద్రతా మండలి ఆంక్షల కమిటీకి కొన్ని ప్రామాణికాలు, ప్రక్రియలు ఉన్నాయి. వాటిపై చైనా పూర్తిగా అధ్యయనం చేస్తుంది. అందుకే మేము ఈ అంశాన్ని సాంకేతికంగా నిలిపి ఉంచామని లూ కాంగ్ వెల్లడించారు. ఈ ప్రాంత సుస్థిరత, శాంతికి చైనా బాధ్యతయుతంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఇండియా, చైనా సంబంధాలపై ప్రశ్నించగా.. ఇప్పటికే జీ జిన్పింగ్, మోదీ గతేడాది నాలుగుసార్లు భేటీలు నిర్వహించారని, రెండు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు