మోడీ మెచ్చిన హైదరాబాదీ
- March 18, 2019
హైదరాబాద్: మై భీ.. చౌకీదార్ నినాదాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నందుకు ఖైరతాబాద్ బీజేపీని సాక్షాత్తు దేశ ప్రధాని ట్విటర్ ద్వారా అభినందించారు. నారాయణగూడకు చెందిన కేశబోయిన శ్రీధర్ బీజేపీలో సీనియర్ నాయకుడు. సోషల్ మీడియాలో చురుకుగా వ్యవహరించే ఆయన పార్టీ కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు.
ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ మై భీ చౌకీదార్ నినాదాన్ని అందుకున్నారు. పార్టీ శ్రేణులందరూ ఈ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ నినాదాన్ని శ్రీధర్ సోషల్ మీడియా ద్వారా నెటిజన్ల దృష్టికి విస్తృతంగా తీసుకెళ్తున్నట్టు గమనించిన ప్రధాని ట్విటర్ ద్వారా శ్రీధర్ను అభినందించారు. ప్రధాని అభినందించడం సంతోషంగా ఉందని, సామాన్య కార్యకర్తల కష్టాన్ని కూడా ప్రధాని గుర్తిస్తారనే దానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కార్లలో పిల్లలను ఒంటరిగా వదిలేస్తే భారీ జరిమానా, జైలు శిక్ష
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం









