పారికర్ మృతి...తదుపరి సీఎంపై కొనసాగుతున్న చర్చలు
- March 18, 2019
పనాజీ: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూయడంతో కొత్త సీఎం ఎవరన్న దానిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఆయన మరణ వార్త తెలిసిన కొన్ని గంటల్లోనే భాజపా సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రానికి చేరుకున్నారు. భాగస్వామ్య పక్షాలతో కలిసి రాత్రి పొద్దుపోయే దాకా చర్చలు జరిపారు. కానీ సమావేశంలో తదుపరి సీఎం ఎవరన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని డిప్యూటీ స్పీకర్ మైకేల్ లోబో తెలిపారు. సంకీర్ణ పక్షమైన మహారాష్ట్రవాదీ గోమంటక్ పార్టీ నేత సుదిన్ ధావలికర్ తననే సీఎం చేయాలని పట్టుబడుతున్నట్లు ఆయన తెలిపారు.
మరోవైపు భాగస్వామ్య పక్షమైన గోవా ఫార్వర్డ్ పార్టీ అధినేత విజయ్ సర్దేశాయ్ కూడా భాజపా అధినాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ''సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాలను వారితో చర్చించాం. అయితే ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. మా ప్రతిపాదనలు వారి ముందు ఉంచాం. వాటిపై వారు స్పందించాల్సి ఉంది. మా పార్టీ ఇంతకాలం మనోహర్ పారికర్కు మద్దతు పలికింది. భాజపాకు కాదు'' అని సర్దేశాయ్ వివరించారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భాజపాకు సొంతంగా 12 మంది శాసనసభ్యులుండగా మిత్రపక్షాలతో కలిపి 20 మంది బలం ఉంది. 14 మంది శాసనసభ్యులతో అసెంబ్లీలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









