నకిలీ వీసాలను అమాయకులకు అంటగడుతున్న కంత్రీగాళ్లు
- March 21, 2019
హైదరాబాద్: ఉపాధి అవకాశాల పేరుతో నకిలీ వీసాలు, పాస్ పోర్టులను అమాయకులకు అంటగడుతున్న కంత్రీగాళ్లు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. 18 మంది ఏజెంట్లను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులంతా ఏపీ, తెలంగాణకు చెందినవారిగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో ఓ మహిళ కూడా ఉంది.
పోలీసులకు పట్టుబడిన వారిలో గల్ఫ్ ఎయిర్లైన్స్, ఒమన్ ఎయిర్ లైన్స్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈముఠాకు సహకరించిన చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న మధుని కూడా అరెస్ట్ చేశారు. ఎంప్లాయి మెంట్, టూరిస్ట్ వీసాలను సృష్టించి మానవ అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్… ఈగ్యాంగ్ సహాయంతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు సజ్జనార్. రూల్స్ పాటిస్తున్న ఏజంట్లను మాత్రమే నమ్మాలని.. మాయమాటలకు మోసపోవద్దని సీపీ సజ్జనార్ సూచించారు.
తోట మణికంఠ గ్యాంగ్ , పుష్ప గ్యాంగ్ రెండు ముఠాలు గా గత కొంత కాలంగా అక్రమ రవాణా చేస్తున్నారు. నకిలీ వీసా, పాస్ పోర్టులను సృష్టించి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు ముఠా సభ్యులు. గడిచిన 15 రోజుల వ్యవధిలోనే శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు 50మందికి పైగా నకిలీ వీసాలతో దుబాయ్ వెళ్తూ పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు పక్కా సమాచారంతో రంగంలోకి దిగి ఏజెంట్ల ఆట కట్టించారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







