నకిలీ వీసాలను అమాయకులకు అంటగడుతున్న కంత్రీగాళ్లు
- March 21, 2019హైదరాబాద్: ఉపాధి అవకాశాల పేరుతో నకిలీ వీసాలు, పాస్ పోర్టులను అమాయకులకు అంటగడుతున్న కంత్రీగాళ్లు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. 18 మంది ఏజెంట్లను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులంతా ఏపీ, తెలంగాణకు చెందినవారిగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో ఓ మహిళ కూడా ఉంది.
పోలీసులకు పట్టుబడిన వారిలో గల్ఫ్ ఎయిర్లైన్స్, ఒమన్ ఎయిర్ లైన్స్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈముఠాకు సహకరించిన చేవెళ్ల పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న మధుని కూడా అరెస్ట్ చేశారు. ఎంప్లాయి మెంట్, టూరిస్ట్ వీసాలను సృష్టించి మానవ అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్… ఈగ్యాంగ్ సహాయంతో గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు సజ్జనార్. రూల్స్ పాటిస్తున్న ఏజంట్లను మాత్రమే నమ్మాలని.. మాయమాటలకు మోసపోవద్దని సీపీ సజ్జనార్ సూచించారు.
తోట మణికంఠ గ్యాంగ్ , పుష్ప గ్యాంగ్ రెండు ముఠాలు గా గత కొంత కాలంగా అక్రమ రవాణా చేస్తున్నారు. నకిలీ వీసా, పాస్ పోర్టులను సృష్టించి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు ముఠా సభ్యులు. గడిచిన 15 రోజుల వ్యవధిలోనే శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు 50మందికి పైగా నకిలీ వీసాలతో దుబాయ్ వెళ్తూ పట్టుబడ్డారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు పక్కా సమాచారంతో రంగంలోకి దిగి ఏజెంట్ల ఆట కట్టించారు.
తాజా వార్తలు
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!