యెమెన్లో ముగ్గురు సైనికుల మృతి: బహ్రెయిన్
- December 29, 2015
బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్) జనరల్ కమాండ్, ముగ్గురు బహ్రెయిన్ సైనికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. సౌదీ నేతృత్వంలోని అరబ్ సమాఖ్య యెమెన్లో పోరాడుతున్న సందర్భంలో ఈ ముగ్గురూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కెప్టెన్ అహ్మద్ మహమ్మద్ అమీన్, కెప్టెన్ ముబారక్ సాద్ అల్ రుమైహి మరియు ఫస్ట్ సర్జెంట్ హసన్ అలి ఎస్కాందర్ మాజిద్ తమ జీవితాల్ని విధి నిర్వహణలో బలిచ్చారని బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ వర్గాలు వెల్లడించారు. సౌదీ సరిహద్దులో ఈ ముగ్గురూ శతృవులతో పోరాడుతూ వీరమరణం పొందారు. సైనికుల కుటుంబాలకు ఈ సందర్భంగా బిడిఎఫ్ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని బిడిఎఫ్ ప్రకటించింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంది బిడిఎఫ్. అలాగే ఈ ఘటనలో గాయపడ్డ సైనికులు త్వరగా కోలుకుంటారని ఆకాంక్షించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







