'పీఎం కిసాన్' రెండోవిడత ఆర్థికసాయం!
- March 24, 2019
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రెండో విడత నగదు బదిలీ ఏప్రిల్ 1 నుంచి జరగనున్నట్లు తెలుస్తోంది. మార్చి 10న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందే ఈ పథకం కింద 4.74 కోట్ల మంది చిన్న,సన్నకారు రైతులను ఎంపిక చేశారు. ఇప్పటికే 2.74 కోట్ల మంది ఖాతాల్లో తొలివిడతగా రూ.2000 చొప్పున జమచేశారు. మిగతావారి ఖాతాల్లోనూ ఈనెలాఖరులోగా నగదు జమ చేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈప్రక్రియను కొనసాగించేందుకు ఈసీ నుంచీ అనుమతులొచ్చినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ పథకం ద్వారా అత్యధిక సంఖ్యలో రైతులు లబ్ధిపొందుతున్న తొలి 3 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









