66 ఏళ్ళ వృద్ధుడికి ఇండియన్ కమ్యూనిటీ సాయం
- March 27, 2019
66 ఏళ్ళ సురేంద్ర నాథ్ ఖన్నా, యూఏఈకి తన కుమారుడ్ని కలిసేందుకు వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఖన్నా ట్రావెల్ లేదా మెడికల్ ఇన్స్యూరెన్స్ లేకపోవడంతో హాస్పిటల్ బిల్స్ 100,000 దిర్హామ్లకి చేరుకుంది. ఎయిర్ అంబులెన్స్ కోసం అప్పు చేసినా, పోర్టబుల్ వెంటిలేటర్ సరిపోని కారణంగా అదీ కుదరలేదు. దానికోసం వెచ్చించిన సొమ్ము కూడా వృధా అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇండియన్ కమ్యూనిటీ ఆయనకు సహాయంగా ముందుకొచ్చింది. ఎట్టకేలకు బాధితుడి కుమారుడు తన తండ్రిని తరలించేందుకు అవసరమైన ఎయిర్ అంబులెన్స్ని సమకూర్చుకోగలిగారు. మరోపక్క బాధిత వ్యక్తికి వైద్య చికిత్స అందిస్తోన్న ఎన్ఎంసి హాస్పిటల్ సైతం బిల్లింగ్ సైకిల్ని కొద్ది రోజులపాటు ఆపి, పేమెంట్ పీరియడ్ని పెంచడానికి నిర్ణయం తీసుకుంది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా వుందని అనుభవ్ చెప్పారు. కాగా, యాక్టింగ్ కాన్సుల్ జనరల్ నీరజ్ అగర్వాల్ మాట్లాడుతూ, ఎన్ఎంసి హాస్పిటల్ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్ సకాలంలో సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







