66 ఏళ్ళ వృద్ధుడికి ఇండియన్ కమ్యూనిటీ సాయం
- March 27, 2019_resources1-large_1553666636.jpg)
66 ఏళ్ళ సురేంద్ర నాథ్ ఖన్నా, యూఏఈకి తన కుమారుడ్ని కలిసేందుకు వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఖన్నా ట్రావెల్ లేదా మెడికల్ ఇన్స్యూరెన్స్ లేకపోవడంతో హాస్పిటల్ బిల్స్ 100,000 దిర్హామ్లకి చేరుకుంది. ఎయిర్ అంబులెన్స్ కోసం అప్పు చేసినా, పోర్టబుల్ వెంటిలేటర్ సరిపోని కారణంగా అదీ కుదరలేదు. దానికోసం వెచ్చించిన సొమ్ము కూడా వృధా అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇండియన్ కమ్యూనిటీ ఆయనకు సహాయంగా ముందుకొచ్చింది. ఎట్టకేలకు బాధితుడి కుమారుడు తన తండ్రిని తరలించేందుకు అవసరమైన ఎయిర్ అంబులెన్స్ని సమకూర్చుకోగలిగారు. మరోపక్క బాధిత వ్యక్తికి వైద్య చికిత్స అందిస్తోన్న ఎన్ఎంసి హాస్పిటల్ సైతం బిల్లింగ్ సైకిల్ని కొద్ది రోజులపాటు ఆపి, పేమెంట్ పీరియడ్ని పెంచడానికి నిర్ణయం తీసుకుంది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా ఆనందంగా వుందని అనుభవ్ చెప్పారు. కాగా, యాక్టింగ్ కాన్సుల్ జనరల్ నీరజ్ అగర్వాల్ మాట్లాడుతూ, ఎన్ఎంసి హాస్పిటల్ మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్ సకాలంలో సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!