దుబాయ్ గ్లోబల్ విలేజ్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- December 30, 2015
వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ మరియు దుబాయ్ రూలర్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ దుబాయ్లోని గ్లోబల్ విలేజ్ని సందర్శించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎంటర్టైన్మెంట్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు, అభివృద్ధికి కేంద్రంగా మారిన గ్లోబల్ విలేజ్లో భాగస్వాములైన కంపెనీల ప్రతినిథులతో మహమ్మద్ మాట్లాడారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రోటోకాల్ మరియు హాస్పిటాలటీ ఇన్ దుబాయ్ డైరెక్టర్ జనరల్ ఖలీఫా సయీద్ సులేమాన్, షేక్ మహమ్మద్ వెంట గ్లోబల్ విలేజ్లో పర్యటించారు. ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫౌండేషన్కి సంబంధించిన పెవిలియన్నీ, అలాగే సౌదీ అరేబియా, థాయ్లాండ్, ఈజిప్ట్ మరియు చైనా దేశాలకు చెందిన పెవిలియన్లను సందర్శించారు షేక్ మహమ్మద్. యూఏఈ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ప్రభుత్వం మరియు ప్రజలు వివిధ దేశాలకు సంబంధించిన సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించడం, అలాగే వివిధ దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండడం గొప్ప విషయమని కొనియాడారు. గ్లోబల్ విలేజ్ దుబాయ్కి చెందిన చారిత్రాత్మక షాపింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కేంద్రంగా వర్దిల్లుతోంది. వివిధ దేశాలకు సంబంధించిన సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచుతాయి. ఈ షాపింగ్ కోసమే వివిధ దేశాల నుంచి పెద్దయెత్తున సందర్శకులు కూడా రావడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







