ఖషోగి సంతానానికి సౌదీ ప్రభుత్వ భారీ చెల్లింపులు!

- April 03, 2019 , by Maagulf
ఖషోగి సంతానానికి సౌదీ ప్రభుత్వ భారీ చెల్లింపులు!

వాషింగ్టన్‌: ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో హత్యకు గురైన జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గి సంతానానికి సౌదీ ప్రభుత్వం భారీ పరిహారం అందజేసిందని వాషింగ్టన్‌ పోస్ట్‌ నివేదించింది. ఈ మేరకు ఖషోగ్గి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు ఖరీదైన బంగ్లాలు, పెద్ద మొత్తంలో డబ్బు అందజేసిందని సోమవారం ఓ కథనం ప్రచురించింది. పోర్టు సిటీ జెడ్డా సమీపంలో దాదాపు నాలుగు మిలియన్‌ డాలర్ల విలువైన ఇండ్లు ఇవ్వడంతో పాటు నెలకు 10,000 డాలర్ల చొప్పున ఒక్కొక్కరికి చెల్లించేందుకు సిద్ధమైందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఖషోగ్గి పెద్ద కుమారుడు సలాV్‌ా ఖషోగ్గి మాత్రమే సౌదీలో నివసించాలని భావిస్తున్నాడని.. మిగతా వాళ్లంతా ఇక్కడ ఉన్న తమ ఆస్తులను అమ్మేసి అమెరికా వెళ్లి స్థిరపడాలని అనుకుంటున్నారని కథనం ప్రచురించింది. ఇక ఇస్తాంబుల్‌కు చెందిన పీహెచ్‌డీ స్కాలర్‌ హేటీస్‌ సెనీజ్‌ అనే మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఖషోగ్గీ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com