ఫీజు పెంపు పుకార్లపై స్పందించిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌

- April 04, 2019 , by Maagulf
ఫీజు పెంపు పుకార్లపై స్పందించిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌

కొత్త అకడమిక్‌ ఇయర్‌కి సంబంధించి ఫీజుల పెంపు అంటూ వస్తున్న పుకార్లపై ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌ స్పందించింది. గత అడ్మినిస్ట్రేషన్‌ చేస్తున్న దుష్ప్రచారం పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలనీ, వాట్సాప్‌ తదితర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ వేదికగా ఈ దుష్ప్రచారం జరుగుతోందనీ, విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి అధికారిక సమాచారాన్నయినా స్కూల్‌ యాజమాన్యాన్ని సంప్రదించి తెలుసుకోవచ్చని వివరణ ఇచ్చింది. ఇండియన్‌ స్కూల్‌లో 12,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పర్షియన్‌ గల్ఫ్‌లో అతి పెద్ద కో-ఎడ్యుకేషన్‌ స్కూల్స్‌లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌ ఒకటి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com