సివిల్స్ ర్యాంక్ సాధించిన కండక్టర్ కూతురు
- April 08, 2019
హైదరాబాద్:తండ్రి బస్సు కండక్టర్, దిగువ మధ్య తరగతి కుటుంబం.అయితేనేమి తన లక్ష్యానికి అవేమీ అడ్డు రాలేదు. ఎలాంటి కోచింగ్ లేకుండా తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో 233వ ర్యాంకు సాధించింది. ఎల్బీ నగర్కు చెందిన పెద్దిటి ధాత్రిరెడ్డి ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించింది. సాధించాలనే లక్ష్యం, తపన, కష్టపడె తత్వం ఉంటే విజయ తీరాలను అందుకోవచ్చని నిరూపించింది. యాదాద్రి జిల్లాకు చెందిన పెద్దిటి కృష్ణారెడ్డి ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా ఎల్బీనగర్లో స్థిరపడ్డారు. కూతురు ధాత్రిరెడ్డి చిన్నతనం నుంచి చదువులో టాపర్. ప్రముఖ విద్యాసంస్ధ ఐఐటీ-ఖరగ్పూర్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. అనంతరం డచ్ బ్యాంకు-ఢిల్లీ శాఖలో ఉద్యోగం సాధించింది. కానీ అంతటితో ఆగిపోలేదు. తన సివిల్స్ కలను సాకారం చేసుకోవాలనుకుంది.9 నెలల క్రితం ఉద్యోగానికి సెలవుపెట్టి పరీక్షకు సన్నద్ధమైంది. చివరకు తన కల నిజం చేసుకుంది. సివిల్స్లో 233వ ర్యాంకు సాధించింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







