సివిల్స్ ర్యాంక్ సాధించిన కండక్టర్ కూతురు
- April 08, 2019
హైదరాబాద్:తండ్రి బస్సు కండక్టర్, దిగువ మధ్య తరగతి కుటుంబం.అయితేనేమి తన లక్ష్యానికి అవేమీ అడ్డు రాలేదు. ఎలాంటి కోచింగ్ లేకుండా తొలి ప్రయత్నంలోనే సివిల్స్లో 233వ ర్యాంకు సాధించింది. ఎల్బీ నగర్కు చెందిన పెద్దిటి ధాత్రిరెడ్డి ఇటీవల ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించింది. సాధించాలనే లక్ష్యం, తపన, కష్టపడె తత్వం ఉంటే విజయ తీరాలను అందుకోవచ్చని నిరూపించింది. యాదాద్రి జిల్లాకు చెందిన పెద్దిటి కృష్ణారెడ్డి ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా ఎల్బీనగర్లో స్థిరపడ్డారు. కూతురు ధాత్రిరెడ్డి చిన్నతనం నుంచి చదువులో టాపర్. ప్రముఖ విద్యాసంస్ధ ఐఐటీ-ఖరగ్పూర్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. అనంతరం డచ్ బ్యాంకు-ఢిల్లీ శాఖలో ఉద్యోగం సాధించింది. కానీ అంతటితో ఆగిపోలేదు. తన సివిల్స్ కలను సాకారం చేసుకోవాలనుకుంది.9 నెలల క్రితం ఉద్యోగానికి సెలవుపెట్టి పరీక్షకు సన్నద్ధమైంది. చివరకు తన కల నిజం చేసుకుంది. సివిల్స్లో 233వ ర్యాంకు సాధించింది.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







