దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి వినూత్న ప్రయోగం

- April 08, 2019 , by Maagulf
దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి వినూత్న ప్రయోగం

విభిన్న చిత్రాల్ని తెరకెక్కిస్తూ ప్రేక్షుల మన్ననల్ని అందుకుంటోన్న విలక్షణ దర్శకుడు పి.సునీల్‌కుమార్‌రెడ్డి మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇంకా టైటిల్‌ నిర్ణయించని ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్‌ అప్పుడే షురూ అయ్యింది. ప్రస్తుత ఎన్నికల సీజన్‌ని దృష్టిలో పెట్టుకుని తనదైన స్టయిల్లో సరికొత్తగా సినిమా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ముగ్గురు యువతులు తమ ఫేస్‌ని పూర్తిగా కన్పించనీయకుండా చేస్తూ, ఆయా రాజకీయ పార్టీల్ని పరోక్షంగా ప్రమోట్‌ చేస్తున్న పోస్టర్‌ని రూపొందించి వదిలారు.ఏ.పి,తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పోస్టర్లు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. 18 ఏళ్ళు దాటినవారంతా ఓటు వేయడానికి అర్హులు, అలాగే మా సినిమా చూడటానికి కూడా.. అంటూ వినూత్నంగా ఈ సినిమా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారడం ద్వారా సినిమాకి మంచి పబ్లిసిటీ లభిస్తోంది. ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంత బాధ్యతాయుతమైన పనో తెలియజేస్తూనే సినిమా ప్రమోషన్స్‌కి ఎన్నికల సీజన్‌ని వాడుకోవాలనే ఆలోచన చేసిన సునీల్‌ కుమార్‌రెడ్డిని అభినందించాలి ప్రతి ఒక్కరూ. ఈ సినిమాకి మా గల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com