సంప్రదాయ బద్ధంగా శ్రీలంక న్యూ ఇయర్ వేడుకలు
- April 13, 2019
శ్రీలంకన్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని 15,000 మందికి పైగా శ్రీలంకన్స్ సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. జబీల్ పార్క్ వద్ద శ్రీలంకన్స్తోపాటు పెద్ద సంఖ్యలో ఇతర దేశాలకు చెందినవారూ హాజరై ఈ వేడుకల్ని తిలకించారు. 'యూఏఈ-శ్రీలంక టోలెరెన్స్ రన్' పేరుతో స్పెషల్ మారథాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీలంక కాన్సుల్ జనరల్ చరిత యట్టగోడా ప్రారంభించారు. సింహళీ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు యట్టగోడా వివరించారు. కానా ముట్టి, కట్టా పోరా, అలియాటా అసా తబీమా, సంగావు అమ్ముత్తా సెవీమా, కోకోనట్ స్క్రాపింగ్, చేతుల్ని వినియోగించకుండా బన్ తినడం వంటి సంప్రదాయ ఆటల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. టగ్ ఆఫ్ వార్ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా మారింది. అలాగే ఫోక్ డాన్స్ ఇతర కల్చరల్ ప్రోగ్రామ్స్ సందర్శకుల్ని అలరించాయి.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







