సంప్రదాయ బద్ధంగా శ్రీలంక న్యూ ఇయర్‌ వేడుకలు

- April 13, 2019 , by Maagulf
సంప్రదాయ బద్ధంగా శ్రీలంక న్యూ ఇయర్‌ వేడుకలు

శ్రీలంకన్‌ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ని 15,000 మందికి పైగా శ్రీలంకన్స్‌ సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. జబీల్‌ పార్క్‌ వద్ద శ్రీలంకన్స్‌తోపాటు పెద్ద సంఖ్యలో ఇతర దేశాలకు చెందినవారూ హాజరై ఈ వేడుకల్ని తిలకించారు. 'యూఏఈ-శ్రీలంక టోలెరెన్స్‌ రన్‌' పేరుతో స్పెషల్‌ మారథాన్‌ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీలంక కాన్సుల్‌ జనరల్‌ చరిత యట్టగోడా ప్రారంభించారు. సింహళీ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు యట్టగోడా వివరించారు. కానా ముట్టి, కట్టా పోరా, అలియాటా అసా తబీమా, సంగావు అమ్ముత్తా సెవీమా, కోకోనట్‌ స్క్రాపింగ్‌, చేతుల్ని వినియోగించకుండా బన్‌ తినడం వంటి సంప్రదాయ ఆటల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. టగ్‌ ఆఫ్‌ వార్‌ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా మారింది. అలాగే ఫోక్‌ డాన్స్‌ ఇతర కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ సందర్శకుల్ని అలరించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com