దుబాయ్లో శ్రీ గణపతి సచ్చిదానంద 'పూర్ణ చంద్ర రాగ సాగర'
- April 16, 2019
దుబాయ్:దత్త యోగ సెంటర్, యూఏఈ నేతృత్వంలో పూర్ణ చంద్ర రాగసాగర పేరుతో మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అనే ఈవెంట్ని నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 19న ఈ ఈవెంట్ జరుగుతుంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సింథసైజర్పై పెర్ఫామ్ చేయబోతున్నారు. ప్రముఖ వయోలిన్ కళాకారుడు డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం కూడా తన ప్రదర్శనను ఇవ్వబోతున్నారు. పండిట్ అనిందో చటర్జీ తబ్లా మరియు విద్వాన్ వి సురేష్ ఘటమ్ ఇతర ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. ఆధ్మాత్మిక గురువు అయిన గణపతి సచ్చిదానంద స్వామీజీ గ్రేట్ మ్యుజీషియన్ కూడా.పలు దేశాల్లో ఇప్పటికే ఆయన అనేక ప్రదర్శనలు ఇచ్చి వున్నారు. ఆయన సంగీతం వినేవారికి సరికొత్త అనుభూతిని మిగుల్చుతుంది. 300కి పైగా మ్యూజిక్ కాన్సెర్ట్స్లో స్వామీజీ పాల్గొన్నారు. ఐ ట్యూన్స్, ప్లే స్టోర్లో 250కి పైగా మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా ఆయనవి అందుబాటులో వున్నాయి. దుబాయ్ ఒపెరాలో స్వామీజీ మ్యూజిక్ కాన్సెర్ట్ కోసం ఏర్పాట్లు ఇప్పటికే జోరందుకున్నాయి.

తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







