తమిళనాడు పోలింగ్.. ఓటేసిన సినీ ప్రముఖులు
- April 18, 2019దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈ రోజు (గురువారం) ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 95 నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్ జరుగుతోంది. సామాన్య ప్రజలతోపాటు సినీ ప్రముఖులు కూడా ఓటేసేందుకు క్యూ కట్టారు. తమిళ ప్రముఖ నటులు సూర్య, కార్తి, జ్యోతిక క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సూపర్స్టార్ రజినీకాంత్ ఓటేసేందుకు ముంబై నుంచి తమిళనాడు వచ్చారు. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, విశ్వనటుడు కమల్ హాసన్, ఆయన కుమార్తె శ్రుతి హాసన్ చెన్నైలోని ఆల్వార్పేటలో క్యూలో నిలుచుని ఓటేశారు. ఇక, తమిళ స్టార్ హీరో అజిత్, ఆయన భార్య షాలినీ, మరో స్టార్ హీరో విజయ్, `బిచ్చగాడు` హీరో విజయ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక