కువైట్లో 3.9 మిలియన్ సోషల్ మీడియా యూజర్లు
- April 19, 2019కువైట్ సిటీ: గడచిన కొన్నేళ్ళలో సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీన్నొక సాంకేతిక సమాచార విప్లవంగా కొందరు అభివర్ణిస్తున్న సంగతి తెల్సిందే. తాజా అంచనాల ప్రకారం కువైట్లో సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 3.9 మిలియన్లుగా తేలింది. వరల్డ్ క్లబ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ కువైటి హింద్ నదీమ్ ఈ విషయాల్ని వెల్లడించారు. ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన డివైజెస్ సంఖ్య, కువైట్ జనాభా కంటే 168 శాతం ఎక్కువ కావడం గమనార్హం. 3.1 మిలియన్ ప్రజలు సోషల్ మీడియాని మొబైల్ ద్వారా వినియోగిస్తున్నారు. వాఆ్సప్, ఇన్స్టాగ్రామ్ యాక్టివ్ యూజర్స్ 18 మిలియన్లు కాగా, ఇందులో 62 శాతం పురుషులు, 38 శాతం మంది మహిళలు. ట్విట్టర్ యూజర్స్ 1.68 మిలియన్లు కాగా ఇందులో 55 శాతం మహిళలు, 45 శాతం పురుషులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల