కువైట్లో 3.9 మిలియన్ సోషల్ మీడియా యూజర్లు
- April 19, 2019కువైట్ సిటీ: గడచిన కొన్నేళ్ళలో సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీన్నొక సాంకేతిక సమాచార విప్లవంగా కొందరు అభివర్ణిస్తున్న సంగతి తెల్సిందే. తాజా అంచనాల ప్రకారం కువైట్లో సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 3.9 మిలియన్లుగా తేలింది. వరల్డ్ క్లబ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ కువైటి హింద్ నదీమ్ ఈ విషయాల్ని వెల్లడించారు. ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన డివైజెస్ సంఖ్య, కువైట్ జనాభా కంటే 168 శాతం ఎక్కువ కావడం గమనార్హం. 3.1 మిలియన్ ప్రజలు సోషల్ మీడియాని మొబైల్ ద్వారా వినియోగిస్తున్నారు. వాఆ్సప్, ఇన్స్టాగ్రామ్ యాక్టివ్ యూజర్స్ 18 మిలియన్లు కాగా, ఇందులో 62 శాతం పురుషులు, 38 శాతం మంది మహిళలు. ట్విట్టర్ యూజర్స్ 1.68 మిలియన్లు కాగా ఇందులో 55 శాతం మహిళలు, 45 శాతం పురుషులు ఉన్నారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ