తవ్వకాల్లో బయటపడ్డ మూడో మాస్క్
- April 20, 2019బిషా: బిషాలోని అల్ అబ్లా ప్రాంతంలోని కాలనీలలో తవ్వకాలు జరుపుతుండగా మూడో మాస్క్ బయటపడింది. సౌదీ అరేబియాలోని అసిర్ రీజియన్లో ఈ ప్రాంతం వుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలసీ అండ్ మ్యూజికమ్స్ - సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ ఈ తవ్వకాలు చేపట్టడం జరిగింది. 2,616 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ మాస్క్ వుందని అధికారులు పేర్కొన్నారు. గోడలు రాళ్ళతో నిర్మితమై వున్నాయనీ, ప్లాస్టర్ దాన్ని కవర్ చేసి వుందని ఎక్స్కవేటింగ్ టీమ్ హెడ్ అబ్దుల్లా అల్ అక్లాబి చెప్పారు. అల్ అబ్లా ప్రాంతాన్ని అతి ముఖ్యమైన ఏన్షియంట్ మైనింగ్ సైట్స్లో ఒకటిగా గుర్తించారు. ప్రాచీన కాల సంపద ఈ తవ్వకాల్లో బయటపడ్డం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాల కారణంగా వెలుగు చూసే చారిత్రక ఆధారాలు, ప్రాంత విశిష్టతను మరింత పెంచుతున్నాయి.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?