వాళ్ళ వల్లే తప్పిదాలు జరిగాయి:అశోక్
- April 22, 2019
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో దొర్లిన ఘోర తప్పిదాలపై ఇంటర్ బోర్డు అధికారి అశోక్ స్పందించారు. “మార్కులపై అనుమానాలు ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవచ్చు.అధ్యాపకులదే పొరపాటు అని తేలితే వారిపై చర్యలు తీసుకుంటాం. వచ్చే సంవత్సరం కాంట్రాక్ట్ సంస్థను మార్చి మరో సంస్థకు బాధ్యతలు అప్పగిస్తాము. బెస్ట్ ఆటోమేషన్ ఇవ్వాలన్న లక్ష్యంతోనే సదురు సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చాం. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతనే గ్లోబరీనాకు కాంట్రాక్టు అప్పగించమన్నారు”. మరోవైపు విద్యార్థులకు జరిగిన అన్యాయంపై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. ఇంటర్ బోర్డ్ కార్యదర్శిని కలవాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. బోర్డు దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!









