వాళ్ళ వల్లే తప్పిదాలు జరిగాయి:అశోక్‌

- April 22, 2019 , by Maagulf
వాళ్ళ వల్లే తప్పిదాలు జరిగాయి:అశోక్‌

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో దొర్లిన ఘోర తప్పిదాలపై ఇంటర్‌ బోర్డు అధికారి అశోక్‌ స్పందించారు. “మార్కులపై అనుమానాలు ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.అధ్యాపకులదే పొరపాటు అని తేలితే వారిపై చర్యలు తీసుకుంటాం. వచ్చే సంవత్సరం కాంట్రాక్ట్‌ సంస్థను మార్చి మరో సంస్థకు బాధ్యతలు అప్పగిస్తాము. బెస్ట్‌ ఆటోమేషన్‌ ఇవ్వాలన్న లక్ష్యంతోనే సదురు సంస్థకు కాంట్రాక్ట్‌ ఇచ్చాం. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతనే గ్లోబరీనాకు కాంట్రాక్టు అప్పగించమన్నారు”. మరోవైపు విద్యార్థులకు జరిగిన అన్యాయంపై విద్యార్థి సంఘాలు బగ్గుమన్నాయి. ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శిని కలవాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. బోర్డు దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com