శ్రీలంక లో పేలుళ్లకు కారణం అదే!
- April 23, 2019
న్యూజిలాండ్లోని మసీదుల్లో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఇస్లామిక్ ఉగ్రవాదులు శ్రీలంకలో బాంబు దాడులు జరిపారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి రువాన్ విజేవర్దనే తెలిపారు. మంగళవారం పార్లమెంట్లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. క్రైస్ట్చర్చ్ దాడులకు ప్రతీకారంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు లంకలో పేలుళ్లకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు. దేశ రక్షణ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు ఆయన అంగీకరించారు. అన్ని ఉగ్ర సంస్థలను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. క్రైస్ట్చర్చ్లోని రెండు మసీదుల్లో జరిగిన ఉన్మాది కాల్పుల్లో 50మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఈస్టర్ పూట జరిగిన వరుస పేలుళ్లలో మృతిచెందిన వారి సంఖ్య 321కి చేరుకున్నది. 38 మంది విదేశీయులు మృతిచెందారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన వెబ్సైట్లోనూ ప్రతీకార అంశం ఉన్నట్లు విచారణాధికారులు గుర్తించారు. పేలుళ్లలో మృతిచెందిన వారికి సామూహిక ఖననం చేస్తున్నారు. గాయపడినవారిలో 375మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







