శ్రీలంక లో పేలుళ్లకు కారణం అదే!
- April 23, 2019
న్యూజిలాండ్లోని మసీదుల్లో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఇస్లామిక్ ఉగ్రవాదులు శ్రీలంకలో బాంబు దాడులు జరిపారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి రువాన్ విజేవర్దనే తెలిపారు. మంగళవారం పార్లమెంట్లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. క్రైస్ట్చర్చ్ దాడులకు ప్రతీకారంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు లంకలో పేలుళ్లకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు. దేశ రక్షణ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు ఆయన అంగీకరించారు. అన్ని ఉగ్ర సంస్థలను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. క్రైస్ట్చర్చ్లోని రెండు మసీదుల్లో జరిగిన ఉన్మాది కాల్పుల్లో 50మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఈస్టర్ పూట జరిగిన వరుస పేలుళ్లలో మృతిచెందిన వారి సంఖ్య 321కి చేరుకున్నది. 38 మంది విదేశీయులు మృతిచెందారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన వెబ్సైట్లోనూ ప్రతీకార అంశం ఉన్నట్లు విచారణాధికారులు గుర్తించారు. పేలుళ్లలో మృతిచెందిన వారికి సామూహిక ఖననం చేస్తున్నారు. గాయపడినవారిలో 375మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







