శ్రీలంక లో పేలుళ్లకు కారణం అదే!

- April 23, 2019 , by Maagulf
శ్రీలంక లో పేలుళ్లకు కారణం అదే!

న్యూజిలాండ్‌లోని మసీదుల్లో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఇస్లామిక్‌ ఉగ్రవాదులు శ్రీలంకలో బాంబు దాడులు జరిపారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి రువాన్‌ విజేవర్దనే తెలిపారు. మంగళవారం పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. క్రైస్ట్‌చర్చ్ దాడులకు ప్రతీకారంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు లంకలో పేలుళ్లకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు. దేశ రక్షణ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు ఆయన అంగీకరించారు. అన్ని ఉగ్ర సంస్థలను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో జరిగిన ఉన్మాది కాల్పుల్లో 50మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఈస్టర్ పూట జరిగిన వరుస పేలుళ్లలో మృతిచెందిన వారి సంఖ్య 321కి చేరుకున్నది. 38 మంది విదేశీయులు మృతిచెందారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన వెబ్‌సైట్‌లోనూ ప్రతీకార అంశం ఉన్నట్లు విచారణాధికారులు గుర్తించారు. పేలుళ్లలో మృతిచెందిన వారికి సామూహిక ఖననం చేస్తున్నారు. గాయపడినవారిలో 375మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com