బంపర్ ఆఫర్తో జియో గిగాఫైబర్..
- April 24, 2019టెలికం దిగ్గజం జియో మరో సంచలనానికి సిద్ధమైంది. మార్కెట్లో జియో సృష్టించిన పేరును గుర్తుంచుకునేందుకు మరో అద్భుత సేవను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. రూ.600లతో గిగాఫైబర్ సేవలను ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జియో గిగాఫైబర్ కింద బ్రాండ్బ్యాండ్, టెలివిజన్, ల్యాండ్లైన్ సేవలన్నింటినీ అందిస్తామని కంపెనీ గతంలోనే తెలిపింది. ప్రస్తుతం రిలయెన్స్ గిగాఫైబర్ను ప్రయోగాత్మకంగా పలుచోట్ల పరిశీలిస్తుంది.
ఇంకా అధికారికంగా రిలీజ్ కాలేదు. అయితే ఇప్పటికే న్యూఢిల్లీ, ముంబైలో గిగాఫైబర్ వన్టైమ్ డిపాజిట్ కింద రూటర్ కోసం రూ.4,500 తీసుకుని, 100 గిగాబైట్స్ డేటాను 100 ఎంబీపీఎస్ వేగంతో ఉచితంగా వినియోగదారులకు అందిస్తూ వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. రిలయెన్స్ జియో గిగాఫైబర్ మొదట 29 పట్టణాల్లో ప్రారంభం కానుందని.. అందులో ముఖ్యంగా న్యూఢిల్లీ, ముంబైలో మొదటి దశలో ఉంటుందని తెలుస్తోంది. జియో గిగాఫైబర్ సేవలు మరో మూడు నెలల్లో అందుబాటులోకి వస్తాయన్న ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు